న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ మాజీ ప్రధాని వాజ్పేయి సహా పలువురు ప్రముఖులకు ఘనంగా నివాళులర్పించారు. రాహూల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. యాత్ర న్యూఢిల్లీలో కొనసాగుతున్నది. ప్రస్తుతం ఆయన విరామంలో ఉన్నారు. వచ్చే నెల 3న యాత్ర తిరిగి ప్రారంభం కానున్నది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం ఢిల్లీలోని శక్తిస్థల్లో ఉన్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి నివాళులు అర్పించారు.
అనంతరం వీర్ భూమిలోని రాజీవ్ గాంధీకి, శాంతివనంలోని దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, రాజ్ఘాట్లోని జాతిపిత మహాత్మా గాంధీకి పుష్పాంజలి ఘటించారు. అటునుంచి విజాయ్ ఘాట్లోని మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సమాధి వద్ధ శ్రద్ధాంజలి ఘటించారు. తర్వాత అటల్ స్మృతి స్థల్ వెళ్లిన రాహుల్.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులు అర్పించారు.
Delhi | Congress MP Rahul Gandhi pays tributes to Former PM Atal Bihari Vajpayee at Sadaiv Atal. pic.twitter.com/HyYaKOKRDk
— ANI (@ANI) December 26, 2022
భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ.. కన్యాకుమారి నుంచి జమ్మకశ్మీర్లో ముగిసేవరకు 3570 కిలోమీటర్ల ప్రయాణించనున్నారు. ఇందులో భాగంగా ఆయన 12 రాష్ట్రాల మీదుగా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 3 వేల కిలోమీటర్లు నడిచారు. ప్రస్తుతం దేశరాజధాని ఢిల్లీకి చేరుకున్నది. అనంతరం ఉత్తరప్రదేశ్ మీదుగా యాత్రను కశ్మీర్ వరకు యాత్రను రాహుల్ కొనసాగించనున్నారు.
Delhi | Congress MP Rahul Gandhi pays tributes to Mahatma Gandhi at Rajghat. pic.twitter.com/KP8oijFHeS
— ANI (@ANI) December 26, 2022
Delhi | Congress MP Rahul Gandhi pays tributes to Former PM Jawaharlal Nehru at Shanti Van. pic.twitter.com/CtHG3zJRc1
— ANI (@ANI) December 26, 2022
Delhi | Congress MP Rahul Gandhi pays tributes to Former PM Indira Gandhi at Shakti Sthal and Former PM Rajiv Gandhi at Veer Bhumi. pic.twitter.com/gt7cgO9qgr
— ANI (@ANI) December 26, 2022
Delhi | Congress MP Rahul Gandhi pays tributes to Former PM Lal Bahadur Shastri at Vijay Ghat. pic.twitter.com/YaTreLAftD
— ANI (@ANI) December 26, 2022