న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, క్వాడ్ నేతలతో భేటీకి సిద్ధమవుతున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మోదీ తీరును తప్పుపడుతూ ట్వీట్ చేశారు. మోదీని ఉద్దేశించి “మిస్టర్ 56 చైనా అంటే భయపడుతున్నా”రని శుక్రవారం ఎద్దేవా చేశారు.
తూర్పు లడఖ్లో చైనా ఆక్రమణలకు సంబంధించిన పలు మీడియా కధనాలతో కూడిన వీడియోను రాహుల్ ట్వీట్ చేస్తూ మిస్టర్ 56 చైనా అంటే భయపడుతున్నారని క్యాప్షన్ జత చేశారు. ప్రధాని మోదపై రాహుల్ వ్యాఖ్యలను కాషాయపార్టీ నేతలు తోసిపుచ్చారు. ప్రధానిపై రాహుల్ వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమని, అంతర్జాతీయ రాజకీయాలపై రాహుల్కు ఎలాంటి పరిజ్ఞానం లేదని బీజేపీ ప్రతినిధి ఆర్పీ సింగ్ విమర్శించారు.