తిరువనంతపురం : కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పున్నమాడ లేక్లో నిర్వహించిన స్నేక్ బోట్ రేస్ ఎగ్జిబిషన్లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ రేసులో రెండు బోట్లు పాల్గొనగా.. రాహుల్ ఉన్న బోటే విజయం సాధించింది. మిగతా వారితో పాటుగా రాహుల్ ఈ పోటీల్లో పాల్గొని, అందరిలో హుషారును నింపారు. ఈ రాహుల్ బోటు రేసులో పాల్గొన్న వీడియోను ఇండియన్ యూత్ కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ బీవీ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
लहरों से डरकर नौका पार नहीं होती,
कोशिश करने वालों की हार नहीं होती#BharatJodaYatra के दौरान जब श्री @RahulGandhi ने लिया Boat Race में हिस्सा.. pic.twitter.com/fnyQmPGSoy— Srinivas BV (@srinivasiyc) September 19, 2022