పాట్నా: బీహార్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఓటర్ల జాబితా(Electoral Rolls) సవరణ చేపట్టేందుకు ఎన్నికల సంఘం సిద్దమైది. అయితే ఆ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ విపక్షాలు ఇవాళ ఆందోళన చేపట్టాయి. మహాఘట్బందన్ నేతలు పాట్నాలో ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సీపీఐ నేత దీపాంకర్ భట్టాచార్య, సీపీఐ నేత డీ రాజా కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ఇన్కం ట్యాక్స్ గోలాంబర్ నుంచి ఈసీ ఆఫీసు వరకు ర్యాలీ తీశారు. రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపు నేపథ్యంలో రైలు, రోడ్డు ట్రాఫిక్ స్తంభించింది. ఓటర్ల జాబితా సవరణ పేరుతో శరణార్థులు, దళితుల, మహాదళితుల, పేద ఓటర్ల హక్కుల్ని హరించివేస్తున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లను బ్లాక్ చేసే ఉద్దేశంతో ఆ చర్య చేపట్టినట్లు విమర్శిస్తున్నారు.
#WATCH | Patna | RJD leader Tejashwi Yadav addresses Mahagathbandhan workers taking part in ‘Bihar Bandh’ rally against electoral roll revision in Bihar
He says, “On the directions of Modi ji and Nitish Kumar, the names of the poor people are being removed from the voter list.… pic.twitter.com/P0sXjT4wxE
— ANI (@ANI) July 9, 2025