న్యూఢిల్లీ: శీతాకాల సమావేశాలు కొనసాగినన్ని రోజులు పార్లమెంట్ ఉభయసభల్లో ఎలాంటి చర్చ లేకుండా బిల్లులను ఆమోదించుకోవాలన్నదే వాళ్ల ఉద్దేశంగా ఉన్నదని అధికార బీజేపీని ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభాపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రాజ్యసభలో వాళ్లకు తగినంత మెజారిటీ లేకపోవడంతో బిల్లులపై చర్చకు ఇష్టపడలేదని, అందుకే ప్రతిపక్ష సభ్యుల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించుకున్నారని అన్నారు. ఆ ప్లాన్లో భాగంగానే సమావేశాల ప్రారంభం రోజే 12 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని ఖర్గే విమర్శించారు.
కాగా, అధికార బీజేపీ కూడా కాంగ్రెస్పై విమర్శలు చేసింది. తాము సభలను సజావుగా నడుపాలనుకున్నా ప్రతిపక్షాలు అనవసర ఆందోళనలు చేసి చర్చ జరుగనివ్వలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ పార్ట్టైమ్ రాజకీయ నాయకుడని, ఇప్పుడు ఆయన నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఎక్కడికైనా టూర్ వేయవచ్చని జోషి వ్యాఖ్యానించారు.