న్యూఢిలీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మూడేండ్లపాటు సాధారణ పాస్పోర్ట్ పొందడానికి ఢిల్లీ కోర్టు శుక్రవారం నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) మంజూరు చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసు పెండింగ్లో ఉన్నందున రాహుల్ గాంధీకి పదేండ్ల పాటు పాస్పోర్ట్ మంజూరు చేయకూడదని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వాదించడాన్ని కోర్టు పరిగణనలోనికి తీసుకొంది. నిబంధనల ప్రకారం మూడేండ్ల కాలానికి పాస్పోర్ట్ను పునరుద్ధరించుకోవడానికి ఎన్వోసీ జారీ చేస్తున్నట్టు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ వైభవ్ మెహతా వెల్లడించారు. లోక్సభ సభ్వత్యం కోల్పోయిన రాహుల్ తనకున్న డిప్లొమేటిక్ పాస్పోర్టును కేంద్ర ప్రభుత్వానికి తిరిగి అప్పగించారు. ఈనెల 31న అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో సాధారణ పాస్పోర్టు పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకున్నారు.