సూరత్: పరువునష్టం కేసులో రెండేండ్ల జైలు శిక్ష పడిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. 2019లో మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం కేసులో రాహుల్కు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ
తీర్పుపై ఆయన అప్పీల్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేయాలని, కింది కోర్టు విధించిన శిక్షను రద్దు చేయాలని కోరారు. బెయిల్ మంజూరు చేసిన అడిషనల్ సెషన్స్ జడ్జి ఆర్పీ మొగెరా.. అప్పీల్ పిటిషన్ను ఏప్రిల్ 13న విచారిస్తామని పేర్కొన్నారు. పిటిషన్పై ఏప్రిల్ 10లోగా జవాబు చెప్పాలని పరువు నష్టం దావా వేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీకి నోటీసులు జారీ చేసారు.