న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దు వివాదాన్ని ఉక్రెయిన్పై రష్యా దాడితో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పోలిక తీసుకువచ్చారు. నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్తో సంభాషిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్తో తన సంప్రదింపుల వీడియోను రాహుల్ తన యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేశారు. రష్యన్లు ఉక్రెయిన్లో ఏం చేశారో చూశాం..ఉక్రెయిన్ పశ్చిమ దేశాలతో బలమైన సంబంధాలను తాము అంగీకరించబోమని రష్యన్లు చెబుతున్నారు..అదే సూత్రాన్ని చైనా భారత్కు వర్తింపచేస్తోందని రాహుల్ చెప్పుకొచ్చారు.
చైనా మనకేం చెబుతుందంటే మేం మీ భూభాగాన్ని మార్చేస్తాం..మేం లడఖ్లో ప్రవేశిస్తాం..అరుణాచల్ ప్రదేశ్లో ప్రవేశిస్తాం..మీరేం చేస్తారో జాగ్రత్తగా ఉండండని డ్రాగన్ మనకు సంకేతాలు పంపుతోందని అన్నారు. ఈ ధోరణితోనే చైనా అందుకు అనువైన వేదికలను నిర్మిస్తోందని చెప్పారు.
చైనా మన భూభాగంలోకి చొచ్చుకువచ్చిందని సైనికులు చెబుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం మన భూభాగంలోకి ఎవరూ రాలేదని నమ్మబలుకుతున్నారని అన్నారు. దీంతో తామేం చేసినా భారత్ స్పందించదని చైనాకు సంకేతాలు పంపినట్లవుతోందని కమల్ హాసన్తో ముచ్చటిస్తూ రాహుల్ పేర్కొన్నారు. మన ప్రభుత్వ వైఖరితో భారత్ సంప్రదింపుల సత్తా నిర్వీర్యమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.