అహ్మదాబాద్/న్యూఢిల్లీ, జూలై 7: ‘మోదీ ఇంటి పేరు’ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఊరట దక్కలేదు. సూరత్ కోర్టు విధించిన రెండేండ్ల జైలుశిక్షపై స్టే విధించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను గుజరాత్ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. రాహుల్ ఇప్పటికే దేశవ్యాప్తంగా 10 కేసులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ..
కింది కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనని, న్యాయంగానే ఉన్నదని సమర్థించింది. మోదీ ఇంటి పేరుకు సంబంధించిన పరువునష్టం కేసులో సూరత్ కోర్టు ఆయనకు విధించిన శిక్షను నిలుపుదల చేసేందుకు సహేతుకమైన కారణం ఏదీ కనిపించడం లేదని పేర్కొంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీం కోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.