న్యూఢిల్లీ: జాతీయ ఎస్సీ కమీషన్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ పోస్టులను భర్తీ చేసి దళితుల హక్కులు, ప్రయోజనాలను కాపాడాలని ఆయన ప్రధాని మోదీని కోరారు. పోస్టులను ఖాళీగా ఉంచడమంటే.. అది బీజేపీ ప్రభుత్వ దళిత వ్యతిరేక మైండ్సెట్ను స్పష్టం చేస్తున్నదని ఆయన ఆరోపించారు. ఎస్సీ కమీషన్ అనేది ఓ రాజ్యాంగ సంస్థ అని, దాన్ని బలహీనపరచడం అంటే, రాజ్యాంగంపై దాడి చేయడమే అని, దళితుల సామాజిక హక్కుల్ని కాలరాసినట్లు అవుతుందని రాహుల్ గాంధీ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. కావాలనే ఎస్సీ కమీషన్లో ఉన్న ఖాళీలను నింపడం లేదన్నారు. ప్రస్తుతం ఏడాది కాలం నుంచి ఎస్సీ కమీషన్లో రెండు కీలక పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎస్సీ కమీషన్లో వ్యక్తులు లేకుంటే, అప్పుడు ప్రభుత్వంలో ఎవరు దళితుల ఆవేదన గ్రహిస్తారని రాహుల్ ప్రశ్నించారు. వాళ్లు ఇచ్చే ఫిర్యాదులపై ఎవరు చర్యలు తీసుకుంటారని అడిగారు. ఎస్సీ కమీషన్లో తక్షణమే పోస్టులను భర్తీ చేయాలని, అప్పుడే ఆ సంస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఎస్సీ కమీషన్ అధిపతిగా కిషోర్ మక్వానా ఉన్నారు. దాంట్లో వైస్ చైర్మెన్, ఓ సభ్యుడి పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
भाजपा सरकार की दलित विरोधी मानसिकता का एक और सबूत देखिए!
दलितों के अधिकारों की रक्षा करने वाले राष्ट्रीय अनुसूचित जाति आयोग को जानबूझकर उपेक्षित कर दिया गया है – इसके दो अहम पद पिछले एक साल से ख़ाली पड़े हैं।
यह आयोग एक संवैधानिक संस्था है – इसे कमज़ोर करना दलितों के संवैधानिक…
— Rahul Gandhi (@RahulGandhi) February 28, 2025