కరోనా విజృంభణ సమయంలో మధ్య తరహా, చిన్న పరిశ్రమల విషయంలో కేంద్రం అవలంబించిన విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా తప్పుబట్టారు. కరోనా సమయంలో మధ్య, చిన్న తరహా పరిశ్రమలు చాలా మూత పడ్డాయని, వారి స్నేహితులకు లాభం చేయడానికి ప్రధాని ఇలా చేశారని రాహుల్ ఆరోపించారు. కరోనా సమయంలో తొమ్మిది శాతం చిన్న తరహా, మధ్య తరగతి పరిశ్రమలు మూత పడ్డాయని సాక్షాత్తూ కేంద్రమే పార్లమెంట్లో ఒప్పుకుందని రాహుల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. చిన్న తరహా, మధ్య తరగతి పరిశ్రమలు మూత పడే విషయంపై నేను పార్లమెంట్లో చాలా సీరియస్గా ప్రశ్నలు వేశాను. కోవిడ్ సమయంలో 9 శాతం చిన్న తరహా, మధ్య తరగతి పరిశ్రమలు మూతపడ్డాయని కేంద్రం బదులిచ్చింది. వారి స్పేహితులకు లాభం చేకూర్చడానికే ఇలా చేసింది. అంటూ రాహుల్ తీవ్రంగా దుయ్యబట్టారు.