న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ఏ యూనివర్సిటీల్లో/విద్యాసంస్థల్లో చదువుకొన్న వారికి ఎక్కువగా ఉద్యోగాలు లభిస్తున్నాయి? ఏ యూనివర్సిటీల్లో చదివిన వారు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యం, సామర్థ్యాన్ని ఎక్కువగా కలిగి ఉంటున్నారన్నదానిపై క్యూఎస్ సంస్థ గురువారం ర్యాంకులను ప్రకటించింది. గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్(జీఈఆర్)-2022 పేరిట విడుదలైన ఈ ర్యాంకుల జాబితాలో టాప్-500లో భారత్ నుంచి 12 విద్యాసంస్థలు స్థానం సంపాదించాయి. వీటిల్లో ఐఐటీ బాంబే టాప్లో ఉన్నది. ఐటీ బాంబే 101-110 మధ్య ర్యాంకు సాధించింది. భారత్ నుంచి టాప్ 500లో ఆరు ఐఐటీలు, బెంగళూరు ఐఐఎస్సీ, మూడు సెంట్రల్ వర్సిటీలు, రెండు ప్రైవేటు వర్సిటీలు ఉన్నాయి.
టాప్-500లోని భారత వర్సిటీలు
ఐఐటీ బాంబే-101-110
ఐఐటీ ఢిల్లీ-131-140
ఐఐటీ మద్రాస్-151-160
ఐఐటీ ఖరగ్పూర్-201-250
ఐఐటీ కాన్పూర్ -251-300
ఐఐటీ రూర్కీ-500
ఐఐఎస్సీ బెంగళూరు,
ఓపీ జిందాల్ వర్సిటీ-301-500
యూనివర్సిటీ ఆఫ్ ముంబై, బిట్స్ పిలానీ-251-300
యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ-201-250
యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా-501