PM Modi | తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు (PV Narasimha Rao)కు అరుదైన గౌరవం దక్కింది. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న (Bharat Ratna) వరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. పీవీకి భారతరత్న వరించడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు దేశానికి పీవీ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఓ రాజీతిజ్ఞుడిగా ఈ దేశానికి పీవీ నర్సింహారావు అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధాన మంత్రిగా పీవీ అందించిన సేవలు చిరస్మరణీయం అన్నారు.
‘ఓ రాజనీతిజ్ఞుడిగా ఈ దేశానికి పీవీ నర్సింహారావు వివిధ హోదాల్లో విస్తృతమైన సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ప్రధాన మంత్రిగా, అనేక సంవత్సరాల పాటు పార్లమెంటు, శాసనసభ సభ్యునిగా ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో పీవీ దూరదృష్టి గల నాయకత్వం కీలకపాత్ర పోషించింది. ఈ దేశ శ్రేయస్సు, అభివృద్ధికి బలమైన పునాది వేసింది’ అని అన్నారు.
భారతదేశం ప్రపంచ మార్కెట్ దృష్టిలో పడింది పీవీ హయాంలోనే అని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. దేశం ఆర్థికాభివృద్ధి దిశగా కొత్త అడుగులు వేసింది కూడా ఆయన పాలనలోనే అని వివరించారు. విదేశాంగ నిపుణుడిగా, విద్యా రంగ కోవిదుడిగా పీవీ అందించిన సహకారం భారతదేశాన్ని సాంస్కృతికంగా, మేథో పరంగా సుసంపన్నం చేసిందని కీర్తించారు.
Delighted to share that our former Prime Minister, Shri PV Narasimha Rao Garu, will be honoured with the Bharat Ratna.
As a distinguished scholar and statesman, Narasimha Rao Garu served India extensively in various capacities. He is equally remembered for the work he did as… pic.twitter.com/lihdk2BzDU
— Narendra Modi (@narendramodi) February 9, 2024
Also Read..
Bharat Ratna | ఒకే ఏడాది ఐదుగురికి భారతరత్న
KCR | ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం.. పీవీకి భారత రత్న ప్రకటించడంపై కేసీఆర్
Bharat Ratna: పీవీ నర్సింహారావు, చరణ్సింగ్, స్వామినాథన్లకు భారత రత్న..