డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ (Pushkar Singh Dhami) నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు మంత్రివర్గం మొత్తం నేడు ప్రమానం చేస్తారు. రాజధాని డ్రెహ్రాడూన్లో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 70 స్థానాలున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బీజేపీ 47 స్థానాల్లో విజయం సాధించింది.
కాగా, ఖటిమా నియోజకవర్గం నుంచి పోటీసిన పుష్కర్ సింగ్ ధామి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భువన్ చంద్ర కప్రి చేతిలో 6579 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. దీంతో రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో ఉత్కంఠ కొనసాగింది. దీనికి తెరదించుతూ.. సోమవారం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ధామీ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన రెండోసారి రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఉత్తరాఖండ్ ఏర్పడిన గత 21 ఏండ్లలో ఏ పార్టీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి రాలేదు. ఆ సాంప్రదాయాన్ని బీజేపీ ఇప్పుడు తుడిపెట్టింది.