చండీగఢ్, సెప్టెంబర్ 24: పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ బీజేపీ ఆజ్ఞలనే పాటిస్తున్నారని అధికార ఆప్ ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేలా ఆయన వ్యవహరిస్తున్నారని మండిపడింది.
ఈ నెల 22న అసెంబ్లీ స్పెషల్ సెషన్ నిర్వహణకు గవర్నర్ అడ్డు చెప్పటంతో గవర్నర్, ఆప్ మధ్య వివాదం రాజుకొన్నది. దీనిపై ఆ రాష్ట్ర మంత్రి అమన్ అరోరా మాట్లాడుతూ.. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో గురువారం విచారకరమైన ఘటన చోటుచేసుకొన్నదని తెలిపారు.