చండీఘడ్ : కొవిడ్-19తో తల్లితండ్రులు ఇద్దరినీ కోల్పోయిన సంతానానికి సామాజిక భద్రత ఫించన్ కింద నెలకు రూ 1500తో పాటు ఉచిత రేషన్ అందచేయనున్నట్టు పంజాబ్ ప్రభుత్వం వెల్లడించింది. తల్లితండ్రులను పోగొట్టుకుని అనాధలైన పిల్లలకు గ్రాడ్యుయేషన్ వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్య అందించనుంది.
మహమ్మారి బారినపడి ఇంటి యజమాని మరణిస్తే కుటుంబ సభ్యులకు పరిహారం కూడా వర్తింపచేస్తామని తెలిపింది. కొవిడ్ ప్రభావిత వ్యకు్తలకు సైతం జులై 1 నుంచి అమలయ్యే ఆశీర్వాద్ పధకం కింద ప్రభుత్వం రూ 51,000 నగదు సాయం అందిస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.