చండీఘఢ్ : రూ. 40 కోట్లకు బ్యాంకును మోసగించిన కేసులో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే జస్వంత్ సింగ్ గజ్జన్ మజ్రాను (AAP MLA Arrest) ఈడీ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. బహిరంగ సభలో పాల్గొన్న ఎమ్మెల్యేను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఆప్ ఎమ్మెల్యేకు ఈడీ గతంలో మూడుసార్లు సమన్లు జారీ చేసినా ఆయన ఖాతరు చేయలేదు.
తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకే బీజేపీ ఇలా వ్యవహరిస్తోందని ఈ ఉదంతంపై కాషాయ పార్టీ లక్ష్యంగా ఆప్ విరుచుకుపడింది. బహిరంగ సభలో ఉన్న ఎమ్మెల్యేను ఈడీ అరెస్ట్ చేయడం బీజేపీ తీరును వెల్లడిస్తోందని, ఆప్ ప్రతిష్టను మసకబార్చడమే కాషాయ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ ప్రతినిధి మల్వీందర్ కాంగ్ పేర్కొన్నారు. రూ. 41 కోట్లకు బ్యాంక్ను మోసగించిన కేసుకు సంబంధించి గత ఏడాది సెప్టెంబర్లో ఆప్ ఎమ్మెల్యే నివాసంతో పాటు మూడు ప్రదేశాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది.
ఈ సోదాల్లో రూ. 16.57 లక్షల నగదు, విదేశీ కరెన్సీ, పలు ఆస్తి పత్రాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. పంజాబ్లోని లుధియానా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఫిర్యాదు ఆధారంగా మజ్రాతో పాటు ఇతరులపై దర్యాప్తు ఏజెన్సీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో పలువురు వ్యక్తులు, సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, ఇతర ప్రభుత్వ అధికారులపైనా అభియోగాలు నమోదయ్యాయి.
Read More :