ముంబై,జూలై 11 (నమస్తే తెలంగాణ): చదువు కోసం విద్యార్థిని ఉపాధ్యాయుడు శిక్షిస్తే, అది ఆ విద్యార్థిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు కాదని బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ వ్యాఖ్యానించింది. బుల్దానాకు చెందిన ఒక కేసులో జస్టిస్ మహేంద్ర చంద్వాని ఇటీవల తీర్పునిస్తూ, సదరు ఉపాధ్యాయునిపై నమోదైన క్రిమినల్ కేసును చట్టవిరుద్ధమని పేర్కొంటూ కొట్టివేశారు. నిరుడు బుల్దానా జిల్లాలోని వాసదికి చెందిన ఉపాధ్యాయుడు గోపాల్ సూర్యవంశీ తరగతి గదిలో వివేక్ అనే విద్యార్థిపై చదువు విషయమై కోప్పడి, 100 గుంజీలు తీయాలని శిక్షించారు.
25 గుంజీలు తీశాక వివేక్ మరి తీయలేనని చెప్పాడు. దీంతో ఉపాధ్యాయుడు మందలించారు. మనస్తాపానికి గురైన వివేక్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్య లేఖ ఆధారంగా పోలీసులు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన రోజు ఉపాధ్యాయుని మాటలు కఠినమైనవి అయినప్పటికీ, అతడి చదువు కోస మే ఆ మాటలు అన్నారని, దాని లో నేరపూరిత ఉద్దేశం లేదని కోర్టు పేరొంది. మృతి చెందిన బాలుడు సున్నిత మనసుడు కావడం వల్లే క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడని కోర్టు తెలిపింది.