అక్రమ కట్టడాల కూల్చివేత డ్రైవ్
అడ్డుకొన్న ప్రజలు.. వెనుదిరిగిన ఆఫీసర్లు
న్యూఢిల్లీ, మే 9: ఢిల్లీలోని షాహీన్బాగ్లో అక్రమ కట్టడాల కూల్చివేత అంటూ దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎస్డీఎంసీ) అధికారులు బుల్డోజర్లతో ఆ ప్రాంతంలోకి రావడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మహిళలు సహా వందలాది మంది ఈ చర్యకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. బుల్డోజర్లు కదలకుండా అడ్డం కూర్చున్నారు. ఎస్డీఎంసీ మేయర్ బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి. దీంతో ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనల్లో ఆప్, కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు. కార్పొరేషన్ అధికారులు భారీ బందోబస్తుతో వచ్చినప్పటికీ ప్రజల నిరసనలతో వెళ్లిపోయారు. సీఏఏ వ్యతిరేక నిరసనలకు షాహీన్ బాగ్ కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే.
కూల్చివేతలు ఆపాలి.. సీపీఎం పిటిషన్
షాహీన్బాగ్లో కూల్చివేతలను ఆపాలని సీపీఎం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాజకీయ పార్టీ ఎందుకు పిటిషన్ దాఖలు చేసిందని ప్రశ్నించింది. ఇందులో జోక్యం చేసుకోలేమని, హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఏప్రిల్లో ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ) జహంగీర్పురిలో అక్రమ కట్టడాల కూల్చివేత డ్రైవ్ చేపట్టగా హింస చెలరేగింది. దీనిపై అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొన్నది. కూల్చివేతలను ఆపాలని ఆదేశించింది.