Nirmala Sitharaman | న్యూఢిల్లీ: 2022, మార్చితో ముగిసిన గత ఐదేండ్లలో రైటాఫ్ చేసిన రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు 14 శాతం మాత్రమే రికవరీ చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రూ.7.34 లక్షల కోట్ల విలువైన లోన్లకు గానూ బ్యాంకులకు రూ.1.03 లక్షల కోట్లు రికవరీగా వచ్చాయని మంగళవారం ఓ ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు.
నాలుగేండ్లు పూర్తయిన తర్వాత నిరర్థక ఆస్తులను ఆర్బీఐ మార్గదర్శకాలు, బ్యాంకు బోర్డులు ఆమోదించిన పాలసీల్లోని రైటాఫ్ విధానాల ప్రకారం సంబంధిత బ్యాంకు బ్యాలెన్స్ షీట్ నుంచి తొలగిస్తారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.