Rishi Sunak | ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ (Infosys Co-founder) నారాయణ మూర్తి (Narayana Murthy) భార్య సుధామూర్తి (Sudha Murty ) అందరికీ సుపరిచితులే. విద్యావేత్త, రచయిత అంతకుమించి గొప్ప మానవతామూర్తిగా పేరు పొందారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ (Infosys Foundation chairperson) గా కొనసాగుతున్నారు. అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ సుధామూర్తి చాలా సాధారణమైన జీవితం గడుపుతారు. దాతృత్వ కార్యక్రమాలతోనే సుధామూర్తి ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. ఆమె చేసిన సామాజిక సేవలను గుర్తించిన కేంద్రం.. పద్మ భూషణ్ (Padma Bhushan) అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే.
ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( President Droupadi Murmu) చేతుల మీదుగా సుధామూర్తి అవార్డును అందుకున్నారు. ఈ వేడుకలకు సుధామూర్తి కుమార్తె, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (UK PM Rishi Sunak) భార్య అక్షతా మూర్తి (Akshata Murty) కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన తల్లి అవార్డు అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు సుధామూర్తి ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
‘నిన్న రాష్ట్రపతి నుంచి మా అమ్మ పద్మ భూషణ్ అవార్డు అందుకుంటున్న క్షణాలను చూసి నేను ఎంతో గర్వపడ్డాను. సమాజం కోసం ఆమె చేసిన సేవలకు ఈ పురస్కారాన్ని పొందారు. ఆమె జీవితం నాకొక ఉదాహరణ’ అంటూ అక్షత రాసుకొచ్చారు. ఈ పోస్టుపై రిషి సునాక్ (Rishi Sunak) స్పందించారు. ‘గర్వించదగ్గ రోజు’ అంటూ అక్షత పోస్ట్కు కామెంట్ చేశారు.
Also Read..
Haryana | కెనడా నుంచి రప్పించి మరీ.. ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు
Twitter Logo | మరోసారి మారిన ట్విట్టర్ లోగో.. మూడు రోజుల తర్వాత సొంతగూటికి చేరిన పిట్ట..!