న్యూఢిల్లీ, జూన్ 23: ప్రొఫెసర్ సాయిబాబాకు వెంటనే మెడికల్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు మేధావులు, పౌర హక్కుల సంఘాల నేతలు కోరారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు.
సాయిబాబా ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిందని, 90% బాధపడుతున్నారని, రెండు సార్లు కరోనా బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్గార్ పరిషద్ కేసులోనే జైలులో ప్రాణాలు కోల్పోయిన స్టాన్ స్వామి పరిస్థితి సాయిబాబాకు రాకుండా చూడాలన్నారు.