ముంబై : ఆన్లైన్ గేమింగ్ యాప్స్ను ప్రోత్సహించే ప్రకటనలో నటించినందుకు బాలీవుడ్ సూపర్స్టార్ షారుక్ ఖాన్ (SRK) నివాసం మన్నత్ ఎదుట కొందరు నిరసన తెలిపారు. ఆందోళనకారుల నిరసన నేపధ్యంలో మన్నత్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో పలువురిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
షారుక్ ఇటీవల ఆన్లైన్ గేమింగ్కు సంబంధించిన యాడ్లో నటించడంతో వివాదంలో కూరుకుపోయారు. షారుక్ ఈ తరహా యాడ్లో నటించడంపై ఆయన ఇంటి ఎదుట ఇటీవల పలువురు నిరసనలు తెలపడంతో మన్నత్ వద్ద బందోబస్తును కట్టుదిట్టం చేశారు. ఆన్లైన్ రమ్మీ పోర్టల్ ఏ23 ఇటీవల షారుక్ ఖాన్ను ఏ23 గేమ్స్ ప్లాట్ఫాంకు బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. యాప్కు ఇటీవల షారుక్ చేసిన ప్రోమోలో రండి కలిసి ఆడదాం అనడం వినిపిస్తుంది.
దీంతో ఆన్లైన్ రమ్మీని ప్రమోట్ చేసే యాడ్లో బాలీవుడ్ సూపర్స్టార్ నటించడానికి వ్యతిరేకంగా షారుక్ నివాసం వద్ద అన్టచ్ యూత్ ఫౌండేషన్ సారధ్యంలో నిరసనలు చేపట్టారు. జంగిల్ రమ్మీ, జుపీ వంటి ఆన్లైన్ గేమింగ్ యాప్స్కు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని ఈ గ్రూప్ వెల్లడించింది. ప్రముఖ నటీనటులు ఈ తరహా ప్రకటనల్లో నటిస్తూ సమాజాన్ని తప్పుదారిపట్టిస్తున్నారని, అన్టచ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన్నత్ బంగ్లా ఎదుట నిరసనలు చేపడతామని ఈ గ్రూప్ ప్రకటించింది.
Read More :
Hyderabad | మద్యం మత్తు.. రోడ్లపై అర్ధనగ్నంగా తిరుగుతూ యువతి వీరంగం