MLAs Assets | న్యూఢిల్లీ, ఆగస్టు 1: పేద, మధ్య తరగతి భారతావనికి ధనవంతులైన ప్రజా ప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు తేలింది. దేశంలోని ఆ పార్టీ.. ఈ పార్టీ అని తేడా లేకుండా దాదాపు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కోటీశ్వరులని తెలిసింది. దేశంలోని 4 వేల మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆస్తులు మూడు ఈశాన్య రాష్ర్టాల తాజా బడ్జెట్లకు సమానమని వారి అఫిడవిట్ల సాక్షిగా వెల్లడైంది. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్(ఎన్ఈడబ్ల్యూ) మంగళవారం విడుదల చేసిన సంయుక్త అధ్యయన నివేదిక ఈ విషయాలు తెలిపింది.
దేశంలోని 4,001 మంది ఎమ్మెల్యేల ఆస్తులు- రూ.54,545 కోట్లు
నాగాలాండ్, మిజోరం, సిక్కిం రాష్ర్టాల 2023-24 బడ్జెట్ మొత్తం- రూ.49,103 కోట్లు