Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ముమ్మరం చేసింది. చత్తీస్ఘఢ్లోని రాజ్నంద్గావ్లో ఆదివారం జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కాషాయ పార్టీ లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడ్డారు.
బీజేపీ నేతలు ప్రతిచోటా తమకు 400 స్దానాలు వస్తాయని చెబుతున్నారని, అదే జరిగితే వారు రాజ్యాంగాన్ని మార్చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యున్నత రాజ్యాంగం కోసం దేశంలో ఎంతోమంది గొప్ప వ్యక్తులు తమ జీవితాలను ధారబోశారని ఆమె పేర్కొన్నారు.
రాజ్యాంగం మహిళలకు సమానత్వ హక్కు, ఆదివాసీలకు నీరు, అటవీ హక్కులను ప్రసాదించిందని చెప్పారు. అలాంటి రాజ్యాంగాన్ని కేవలం అధికారం కోసం పాకులాడే కాషాయ పార్టీ మార్చాలని కోరుకుంటోందని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు. కాషాయ పాలకులు ప్రజల హక్కులను నిర్వీర్యం చేయాలని, రిజర్వేషన్లను నిర్వీర్యం చేయాలని కోరుకుంటున్నారని విమర్శించారు.
Read More :
Trisha | న్యాయం నా పక్షం.. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు: త్రిష