Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాజస్థాన్లో కొనసాగుతోంది. సోమవారం పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి, రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కుమార్తె మిరయా వాద్రా పాల్గొన్నారు. వారితోపాటు వందలాదిమంది మహిళలు పాదయాత్రలో భాగస్వాములయ్యారు. కాగా, ప్రియాంక కుమార్తె మిరయా ఈ యాత్రలో హైలెట్గా నిలిచింది.
తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర 95వ రోజు కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఆయన ఈ యాత్ర చేపట్టారు. ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో పూర్తైన ఈ యాత్ర ప్రస్తుతం రాజస్థాన్ మీదుగా ముందుకు సాగుతోంది. 150 రోజుల్లో 12 రాష్ట్రాల మీదుగా 3570 కి.మీ ప్రయాణించిన తర్వాత ఈ యాత్ర జమ్మూ కాశ్మీర్లో ముగుస్తుంది.
ఇదిలా ఉండగా.. రాహుల్ యాత్ర ముగియగానే.. ఆయన సోదరి ప్రియాంక గాంధీ పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాదిలో రెండు నెలల పాటు మహిళా మోర్చా పేరిట యాత్ర చేపడతారని పార్టీ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఇప్పటికే వెల్లడించారు. జనవరి 26 నుంచి మార్చి 26 వరకూ అన్ని రాష్ట్రాల రాజధానుల మీదుగా ప్రియాంక యాత్ర సాగుతుందని చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు రోజునే ప్రియాంక పాదయాత్ర ప్రారంభమవుతుండటం విశేషం.
करोंड़ों आंखों से देखे गए सपनों को अपनी आंखों में संजोए आगे बढ़ रहा है कोई… अब रुकना इसे मंजूर नहीं। #BharatJodoYatra pic.twitter.com/M6G9ewVwtH
— Congress (@INCIndia) December 11, 2022
कहीं दूर तक ज़मीं नजर नहीं आती है
ये तुम्हारी मोहब्बतों का असर है।वाह राजस्थान…#BharatJodoYatra pic.twitter.com/0hf4cel4gW
— Congress (@INCIndia) December 12, 2022