Priyanka Chaturvedi : చండీఘడ్ మేయర్ ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు నేపధ్యంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డాపై శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో తొలుత బీజేపీ విజయం సాధించగా ఆప్-కాంగ్రెస్ అభ్యర్ధిని మేయర్గా ప్రకటిస్తూ సర్వోన్నత న్యాయస్ధానం తీర్పు వెలువరించింది.
చండీఘఢ్ మేయర్ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించినా ఫలితాన్ని తారుమారు చేస్తూ బీజేపీ గెలుపొందడంతో పార్టీని అభినందిస్తూ నడ్డా చేసిన ట్వీట్ను ప్రియాంక చతుర్వేది ప్రస్తావించింది. కాషాయ పా్టీ ప్రజాస్వామ్యాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టింది. ఇండియా కూటమి ఏర్పాటైన అనంతరం తొలి ఎన్నికలో చండీఘఢ్ మేయర్ పదవిని కోల్పోయిందని, విపక్షాల మధ్య గణాంకాలు, కెమిస్ట్రీ కుదరడం లేదని తేటతెల్లమవుతోందని నడ్డా ట్విట్టర్లో రాసుకొచ్చారు.
ఓటమి పాలైన ఆప్ అభ్యర్ధి కోర్టును ఆశ్రయించడంతో ఫలితం తారుమారైంది. మేయర్ ఎన్నికల్లో మోసానికి పాల్పడినందుకు నడ్డా క్షమాపణ కోరుతూ ట్వీట్ చేయాలని ప్రియాంక చతుర్వేది కోరారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసేందుకు రికార్డు స్ధాయిలో ప్రయత్నాలు జరిగాయి. బీజేపీ ఫోర్జరీకి తెగబడినా విపక్ష ఇండియా కూటమి తొలి విజయం సాధించిందని నడ్డా రీట్వీట్ చేయాలని ఆమె సూచించారు.
Read More :
Brain chip | మెదడుతో మౌస్ కంట్రోల్.. న్యూరాలింక్ ప్రయోగంలో సానుకూల ఫలితం..!