న్యూఢిల్లీ: బ్రెయిన్ చిప్ ఇంప్లాంట్కు సంబంధించి హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్లో సానుకూల ఫలితాలు వచ్చినట్టు ఎలాన్మస్క్కు చెందిన న్యూరాలింక్ వెల్లడించింది. ప్రపంచంలోనే తొలిసారిగా గత నెలలో ఓ వ్యక్తి మెదడులో న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ అమర్చిన సంగతి తెలిసిందే.
ఆ రోగి పూర్తిగా కోలుకున్నాడని, మెదడు ద్వారా కంప్యూటర్ మౌస్ను నియంత్రించగలుగుతున్నాడని న్యూరాలింక్ తెలిపింది. ప్రతికూల ప్రభావాలేమీ కనిపించలేదని పేర్కొన్నది. ఆలోచనల ద్వారా మౌస్ బటన్స్ను నియంత్రించడం తదుపరి లక్ష్యమని వివరించింది.