బెంగళూర్ : కర్నాటకలో (Karnataka) పదవుల పంచాయితీ మళ్లీ మొదటికొచ్చింది. అధికారంలోకి రాగానే సీఎం పదవి కోసం డీకే శివకుమార్, సిద్ధరామయ్య తలపడగా మరోసారి అత్యున్నత పదవి కోసం కాంగ్రెస్లో కుమ్ములాటలు జోరందుకున్నాయి. ఈసారి సీఎం పదవిపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుమారుడు, ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే కన్నేశారు.
హైకమాండ్ సీఎం పదవిని తనను చేపట్టాలని కోరితే తాను అందుకు సిద్ధంగా ఉన్నానని ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో విభేదాలను మరోసారి బహిర్గతం చేశాయి. ఇక ప్రియాంక్ ఖర్గే ప్రకటనతో ఉలిక్కిపడిన సీఎం సిద్ధరామయ్య దిద్దుబాటు చర్యలకు దిగారు. ఐదేండ్ల పాటు తానే సీఎంగా కొనసాగుతానని స్పష్టం చేశారు. రెండున్నరేండ్ల తర్వాత సిద్ధరామయ్య పదవి నుంచి వైదొలగుతారని, ఆపై నాయకత్వ మార్పు ఉంటుందనే ప్రచారం నడుమ పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
ఐదేండ్ల పాటు తమ ప్రభుత్వమే ఉంటుందని, తాను సీఎంనని తానే కొనసాగుతానని సిద్ధరామయ్య వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మరోవైపు కర్నాటకలో కాంగ్రెస్ సర్కార్ను కూలదోసేందుకు కాషాయ నేతలు ప్రయత్నిస్తున్నారని, తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రూ. 1000 కోట్లు సమకూర్చాలని కోరారని ఖర్గే ఆరోపించారు.
Read More :
Keedaa Cola | కీడాకోలాలో తరుణ్ భాస్కర్ టీం ఫన్ రైడ్ వర్కవుట్ అయినట్టేనా..?