బెంగళూరు: కర్ణాటకలో ఆరెస్సెస్ కార్యకలాపాల్ని నిషేధిస్తామని ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే హెచ్చరించారు. ఆరెస్సెస్పై నిషేధం విధించేలా బీజేపీయే తమను రెచ్చగొడుతున్నదని, కాంగ్రెస్ తన అధికార బలాన్ని చూపాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నదని ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తే ఆరెస్సెస్పై పై వేటు వేస్తామన్నారు. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్న శక్తులపై కఠిన చర్యలుంటాయని ఇటీవల ఆయన హెచ్చరించారు.