న్యూఢిల్లీ : సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Sanatan Dharma Remark) చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలతో విభేదిస్తూ, సమర్ధిస్తూ పలువురు నేతలు మాట్లాడుతుండటంతో వివాదం రగులుతోంది. సనాతన ధర్మంపై స్టాలిన్ వ్యాఖ్యలకు సంబంధించి ట్విట్టర్ వేదికగా కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ నడుమ వాగ్యుద్ధం చెలరేగింది.
వేలాది సంవత్సరాలుగా ఎన్నో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని, అవి మనుషుల మధ్య వివక్షను పెంచుతూ మనిషిగా వారికి గౌరవాన్ని ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయని ప్రియాంక్ ఖర్గే ట్విట్టర పోస్ట్లో పేర్కొన్నారు. దీనిపై బీజేపీ నేత బీఎల్ సంతోష్ స్పందిస్తూ ఒకరి కడుపులో ఇన్ఫెక్షన్ ఉంటే మీరు తల నరికేస్తారా..?? అని ప్రశ్నించారు.
ఈ ట్వీట్పై రియాక్టయిన ప్రియాంక్ ఖర్గే మనలో నయం చేయాల్సిన ఇన్ఫెక్షన్ ఉందని బీఎల్ సంతోష్ గుర్తించడం సంతోషకరమని, వేల సంవత్సరాల నాటి ఇన్ఫెక్షన్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. నేను మీ అంత తెలివైన వాడిని కాదని, తాను లేవనెత్తన ప్రశ్నలకు సమాధానం ఇచ్చి తనలో చైతన్యం నింపాలని ఖర్గే పేర్కొన్నారు. సమాజంలో ఈ నియమాలను ఎవరు రూపొందించారు..? ఇతరుల కంటే మరొకరు సరైన వారని ఎలా చెబుతారు..? మనల్ని కులాల వారీగా ఎవరు విడదీశారు? కొందరు ప్రజలను ఎందుకు అంటరానివారిగా పరిగణిస్తారు? ఇప్పటికీ వారిని ఆలయాల్లోకి ఎందుకు రానీయడం లేదని సోషల్ మీడియా వేదికగా ప్రియాంక్ ఖర్గే నిలదీశారు.
Read More :