బెంగళూరు: ప్రైవేట్ శిక్షణ విమానం ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అది కూలిపోయింది. ఆ విమానంలోని కెప్టెన్, ట్రైనీ పైలట్ ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (private aircraft crashes) కర్ణాటకలోని విజయపుర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం రెడ్ బర్డ్ ఏవియేషన్కు చెందిన ఒక ప్రైవేట్ శిక్షణా విమానం కలబురగి నుండి బెళగావికి వెళ్తున్నది.
కాగా, ఆకాశంలో ఎగురుతుండగా ఆ ట్రైనీ విమానం ఇంజిన్లో సమస్య వచ్చింది. ఈ నేపథ్యంలో మంగళూరు గ్రామంలోని పొలంలో అది కూలిపోయింది. ఆ విమానంలో ఉన్న కెప్టెన్, ట్రైనీ పైలట్ ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వారిని వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాబలేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఈ నేపథ్యంలో ఆ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంపై వివరాలు సేకరించారు. ఏవియేషన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
SIR Row | ఆసుపత్రి మార్చురీలో భార్య, కుమారుడి మృతదేహాలు.. ‘సర్’ విచారణకు హాజరైన వ్యక్తి