PM Modi | రామేశ్వరంలో సముద్రస్నానం చేసి.. రామనాథస్వామిని దర్శించుకున్న ప్రధాని మోదీ
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటన కొనసాగుతున్నది. రామేశ్వరంలోని రామనాథస్వామిని దర్శించుకున్నారు. అంతకు ముందు సముద్రంలో పుణ్యస్నానం ఆచరించిన అనంతరం ప్రధాన మంత్రి క్షేత్రంలోని తీర్థాల్లోనూ స్నానమాచరించారు. అనంతరం రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు.
#WATCH | Prime Minister Narendra Modi offers prayers at Sri Arulmigu Ramanathaswamy Temple in Rameswaram, Tamil Nadu. The Prime Minister also took a holy dip into the sea here. pic.twitter.com/v7BCSxdnSk
— ANI (@ANI) January 20, 2024
ఆలయంలో ‘శ్రీరామాయణ పారాయణ’ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఇందులో ఎనిమిది విభిన్న సంప్రదాయ బృందాలు సంస్కృతం, అవధి, కాశ్మీరీ, గురుముఖి, అస్సామీ, బెంగాలీ, మైథిలీ, గుజరాతీ భాషల్లో రామకథను పఠించారు. రామకథలో లంకాపతి రావణుడితో యుద్ధం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సంఘటనను వివరించడం జరిగింది.
#WATCH | Tamil Nadu: Prime Minister Narendra Modi attends ‘Shri Ramayana Paryana’ programme at the Sri Arulmigu Ramanathaswamy Temple in Rameswaram
In the programme, eight different traditional Mandalis are reciting the Sanskrit, Awadhi, Kashmiri, Gurumukhi, Assamese, Bengali,… pic.twitter.com/SXbjuwFSGy
— ANI (@ANI) January 20, 2024
రామేశ్వరం చేరుకునే ముందు ప్రధాని మోదీ రోడ్షోలో పాల్గొన్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు బారులు తీరారు. రోడ్షోలో ప్రధానిపై పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా రామనాథస్వామితో పాటు ధనుష్కోడిలోని కోదండ రామస్వామి ఆలయంలో ప్రధాని దర్శనం, పూజలు చేశారు. ధనుష్కోడి సమీపంలోని మునై ప్రాంతాన్ని సైతం సందర్శించారు. రావణుడితో యుద్ధానికి ముందు, శ్రీరాముడి సైన్యం ఈ ప్రదేశం నుంచి రామసేతు నిర్మాణాన్ని ప్రారంభించిందని భావిస్తారు. ఇదిలా ఉండగా.. ఇవాళ ప్రధాని రంగంలోని రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించారు.