Supreme Court: సుప్రీంకోర్టు ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు జరుపుకుంటున్నారు. ఇవాళ (ఆదివారం) ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ఈ వజ్రోత్సవాలను ప్రారంభించారు. అదేవిధంగా సుప్రీంకోర్టు కొత్త వెబ్సైట్ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ వెబ్సైట్తో దేశ పౌరులకు సుప్రీంకోర్టుకు సంబంధించిన డిజిటల్ నివేదికలు, తీర్పులు అందుబాటులోకి రానున్నాయి.
భారత సర్వోన్నత న్యాయస్థానం 1950 జనవరి 28న ప్రారంభమైంది. నేటికి సరిగ్గా 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు వజ్రోత్సవాలు జరుపుకుంటోంది. దేశంలో ప్రాథమిక హక్కులను కాపాడటంలో సుప్రీం కీలకపాత్ర పోషిస్తోంది. రాజ్యంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న చట్టాలను సైతం సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది.
#WATCH | PM Narendra Modi attends Diamond Jubilee celebrations of the Supreme Court of India pic.twitter.com/Ru2rFUb0pz
— ANI (@ANI) January 28, 2024