బాలాసోర్, జూన్ 3: రైలు ప్రమాదానికి కారణమైన ఎవరినీ వదిలిపెట్టబోమని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రధాని మోదీ అన్నారు. శనివారం ఆయన ప్రమాదస్థలిని పరిశీలించి, బాలాసోర్ దవాఖానలో క్షతగాత్రులను పరామర్శించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ… గాయపడ్డ వారికి మెరుగైన చికిత్సను అందిస్తామని పేర్కొన్నారు. ప్రమాదంపై తన బాధను వర్ణించడానికి మాటలు రావడం లేదని పేర్కొన్నారు. అంతకుముందు ఆయన ఢిల్లీలో రైలు ప్రమాదంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.