ప్రధాని మోదీ ‘వందే భారత్’ రైలుకు మరోసారి(16వ సారి) పచ్చజెండా ఊపారు. మంగళవారం కేరళలోని తిరువనంతపురం స్టేషన్లో ఈ సెమీ హైస్పీడ్ రైలు సర్వీస్ను ప్రారంభించారు. ఈ రైలు తిరువనంతపురం నుంచి కాసర్గోడ్ వరకు నడుస్తుంది. ఒకే విధమైన కొత్త రైలు సర్వీస్ను ఎవరైనా ఒకసారే ప్రారంభిస్తారు.
అయితే ప్రధాని హోదాలో ఉన్న మోదీ మాత్రం అదే రైలుకు పదేపదే జెండా ఊపుతుండటంపై విమర్శలు వస్తున్నాయి.