న్యూఢిల్లీ: గ్లోబల్ పాటీదార్ బిజినెస్ సమ్మిట్ను ప్రధాని మోదీ శుక్రవారం వర్చువల్గా ప్రారంభించారు. సూరత్లో జరుగుతున్న ఈ సదస్సును సర్దార్ధామ్ సంస్థ నిర్వహిస్తున్నది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో నిర్ణయాత్మక రాజకీయశక్తిగా ఉన్న పాటీదార్ల ఓటు బ్యాం కును ఆకర్షించే ఎత్తుగడలో భాగంగా మోదీ ఈ సదస్సును స్వయంగా ప్రారంభించారనే చర్చ నడుస్తున్నది. పాటీదార్లు గణనీయంగాఉండే సూరత్ ప్రాంత ంలో దీన్ని నిర్వహిస్తుండటం గమనార్హం. రాష్ట్రంలో పాటీదార్లకు 12శాతం ఓట్ షేరింగ్ ఉన్నది.