న్యూఢిల్లీ : ప్రధాని మోదీ భారత్ పేరును మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. దేశం పేరును ఇండియాకు బదులు భారత్గా మార్చే యోచనలో కేంద్రం ఉన్నదంటూ గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న చర్చకు బలం చేకూర్చే విధంగా ప్రధాని మోదీ ఈ అంశాన్ని మళ్లీ లేవనెత్తారు. అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సు-2023 ప్రారంభం సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ భారత సర్వోన్నత న్యాయస్థానాన్ని ‘సుప్రీంకోర్టు ఆఫ్ భారత్’గా పేర్కొన్నారు. తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి తెచ్చినందుకు సుప్రీంకోర్టు ఆఫ్ భారత్ను అభినందిస్తున్నానని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.