PM Surya Ghar | ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా ఉచిత విద్యుత్ పథకం పీఎం సూర్య ఘర్ : బిజ్లీ ముఫ్త్ యోజన (PM Surya Ghar: Muft Bijli Yojana) కొత్త పథకాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. మరింత స్థిరమైన అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పథకం ద్వారా ప్రజలకు ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యనందించేందుకు కేంద్రం ఇటీవల బడ్జెట్లో పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రూ.75వేలకోట్ల పెట్టుబడితో ప్రాజెక్టు ద్వారా ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించడం ద్వారా కోటి ఇండ్లలో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
పథకం కింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు. రూఫ్టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు సబ్సిడీ నుంచి రాయితీతో కూడిన బ్యాంకుల రుణాలు పొందవచ్చని.. వీటితో ప్రజలపై ఎలాంటి వ్యయభారంపడకుండా కేంద్రం భరోసా ఇస్తుందన్నారు. స్టేక్ హోల్డర్లందరూ జాతీయ ఆన్లైన్ పోర్టల్లో ఏకీకృతం చేయబడతారని, ఇది సౌలభ్యాన్ని మరింత మెరుగుపరుస్తుందన్నారు. పథకానికి క్షేత్రస్థాయిలో ప్రచారం కల్పించేందుకు పట్టణ స్థానిక సంస్థలకు, పంచాయతీలకు అందించనున్నట్లు పేర్కొన్నారు. పట్టణాలు, పంచాయతీలు తమ పరిధిలో రూఫ్టాప్ సోలార్ వ్యవస్థను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
ఈ పథకంతో విద్యుత్ బిల్లులు తక్కువ రావడంతో పాటు ఉపాధి కల్పన జరుగుతుందని తెలిపారు. ‘సౌరశక్తిని, స్థిరమైన అభివృద్ధిని మరింత విస్తృతం చేద్దాం’ మంటూ పిలుపునిచ్చారు. గృహ వినియోగదారులు, ముఖ్యంగా యువత ఈ ‘సూర్య ఘర్’ పథకాన్ని బలోపేతం చేయాలని కోరారు. ఇందుకోసం pmsuryaghar.gov.inలో దరఖాస్తు చేస్తు చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఇటీవల బడ్జెట్లో నిర్మలా సీతారామన్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా నేపథ్యంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రూఫ్టాప్ సిస్టమ్ బిగింపు ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా 15వేల నుంచి 18వేల వరకు ఆదా అవుతుందని, వినియోగించుకోగా విద్యుత్ మిగిలితే.. పంపిణీ సంస్థలకు విక్రయించుకోవచ్చని బడ్జెట్ ప్రసంగంలో కేంద్రం మంత్రి పేర్కొన్నారు.
In order to further sustainable development and people’s wellbeing, we are launching the PM Surya Ghar: Muft Bijli Yojana. This project, with an investment of over Rs. 75,000 crores, aims to light up 1 crore households by providing up to 300 units of free electricity every month.
— Narendra Modi (@narendramodi) February 13, 2024