న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ పర్యటన దాదాపు ఖరారైందని వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో ఉత్తరాఖండ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన కీలకం కానుందని పార్టీ రాష్ట్ర వర్గాలు భావిస్తున్నాయి. ఈ పర్యటనలో భాగంగా కొన్ని కీలక ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారని సమాచారం.
ఈ పర్యటనలో మోదీతోపాటు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ పాల్గొంటారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. వీరిద్దరి పర్యటన రాష్ట్రం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజలకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివద్ధిని గుర్తుచేసినట్లు ఉంటుందని వారు అంటున్నారు.
ఈ పర్యటన సందర్భంగా మోదీ కేదార్నాథ్ను దర్శించుకోనున్నారని బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే ఈ పర్యటనపై అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటనా రాలేదు. దీనిపైవ వచ్చే రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.