న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజు విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు సామాన్యులపై మరోసారి భారం మోపాయి. పెట్రోల్, డీజిల్పై లీటర్కు 80 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో మార్చి 22 తర్వాత ఇది పదోసారి. తాజా పెంపుతో న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.102.61కి, డీజిల్ ధర రూ.93.87కు చేరాయి. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ.117.57, డీజిల్ రూ.101.79కి పెరిగాయి.
మహా నగరాలైన చెన్నైలో రెండింటిపై 76 పైసల చొప్పను పెరిగాయి. దీంతో పెట్రోల్ రూ.108.21, డీజిల్ రూ.108.21గా ఉన్నాయి. కోల్కతాలో పెట్రోల్ రూ.112.19 (84 పైసలు), డీజిల్ రూ.97.02 (80 పైసలు)కు చేరాయి.
ఇక హైదరాబాద్లో పెట్రోల్పై 90 పైసలు, డీజిల్పై 87 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో నగరంలో లీటరు పెట్రోల్ రూ.116.32, డీజిల్ రూ.102.45గా ఉన్నాయి.
గతకొన్ని రోజులుగా పెరుగుతున్న పెట్రలో, డీజిల్ ధరలకు శుక్రవారం బ్రేక్ పడింది. అయితే వాహనదారులకు కొంత ఊరటనిచ్చిన కంపెనీలు.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను పెంచిన విషయం తెలిసింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.250 మేర పెంచాయి. దీంతో సిలిండర్ ధర రూ. 2,253కు చేరింది. అయితే ఇండ్లల్లో వాడుకునే 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ రేట్లను సవరించకపోవడం కొంతలో కొంత ఆనందించదగిన విషయమే.