న్యూఢిల్లీ: వరుసగా పెట్రో ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం వాహనదారులపై మోయలేని భారం వేస్తున్నది. గ్యాప్లేకుండా చమురు ధరలు పెంచుతూ సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నది. మార్చి 22న ప్రారంభమైన ధరల మోత కొనసాగుతూనే ఉన్నది. ఆదివారం పెట్రోల్పై 91 పైసలు, డీజిల్పై 87 పైసల చొప్పున పెంచిన చమురు కంపెనీలు తాజాగా 40 పైసలు వడ్డించాయి. దీంతో గత 14 రోజుల వ్యవధిలో ఇంధన ధరలు పెరుగడం ఇది పన్నెండోసారి. మొత్తంగా లీటర్ పెట్రోల్పై రూ.9.44, డీజిల్పై రూ.9.10 పెరిగింది.
తాజా పెంపుతో న్యూఢిల్లీలో పెట్రోల్ ధర రూ.103.81, డీజిల్ రూ.95.07కు చేరింది. ముంబైలో పెట్రోల్పై 84 పైసలు పెరగడంతో రూ.118.83కు పెరగగా, డీజిల్పై 43 పైసలు అధికమవడంతో రూ.103.07కు చేరింది.
ఇక హైదరాబాద్లో పెట్రోల్పై 45 పైసలు, డీజిల్పై 43 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో లీటరు పెట్రోల్ ధర రూ.117.68కి, డీజిల్ రూ.103.75కి చేరింది.