న్యూఢిల్లీ: చమురు ధరలు మళ్లీ పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటరు పెట్రోల్, డీజిల్పై 35 పైసల చొప్పున పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.108.64కు చేరగా, డీజిల్ ధర రూ.97.37కు పెరిగింది. ముంబైలో పెట్రోల్ రూ.114.47, డీజిల్ రూ.105.49, కోల్కతాలో పెట్రోల్ రూ.109.02, డీజిల్ రూ.100.49, చెన్నైలో పెట్రోల్ రూ.105.43, డీజిల్ రూ.101.59గా ఉన్నాయి.
ఇక తాజా పెంపుతో హైదరాబాద్లో లీటరు పెట్రోలు 37 పైసలు అధికమై రూ.113కు, డీజిల్ ధర 28 పైసలు పెరిగి రూ.106.22కు చేరాయి. ప్రతిరోజూ చమురు ధరలు పెరుగుతుండటంతో సామాన్యుడి జేబుకు చిళ్లు పడుతున్నది. రోజువారీ సంపాదనలో అధికభాగం పెట్రోల్, డీజిల్కే వెచ్చించాల్సి వస్తున్నది.