ముంబై : మహారాష్ట్రలో పాలక కూటమి మహాయుతితో రానున్న లోక్సభ ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటు చర్చలను బీజేపీ కొనసాగిస్తోంది. భాగస్వామ్య పార్టీలు అధిక సీట్లకు పట్టుబట్టడంతో కాషాయ పార్టీపై ఒత్తిడి పెరుగుతోంది. ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) శివసేన (ఏక్నాథ్ షిండే వర్గం) నుంచి అధిక సీట్లు కేటాయించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఈ పార్టీలకు సీట్ల కేటాయింపు విషయంలో కాషాయ పార్టీ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం నాటి రాష్ట్ర పర్యటనకు వస్తున్న రోజే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ దాదాపు 16 లోక్సభ స్ధానాలపై సమీక్ష నిర్వహించనుండటం ఉత్కంఠ రేపుతోంది. ఇక అజిత్ పవార్ వర్గం ప్రస్తుతం ఒకే ఒక లోక్సభ స్ధానం కలిగిఉంది. పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ సునీల్ తత్కరే రయ్ఘడ్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ స్ధానాలకు గాను అజిత్ పవార్ వర్గం కనీసీం 10 లోక్సభ స్ధానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది.
ధారాసివ్, పర్బని, బుల్దానా, మాల్దా, గడ్చిరోలి, హింగోలి, బారామతి, షిరూర్, సతారా, రాయ్ఘఢ్ స్ధానాల్లో పోటీ చేయాలని ఆ పార్టీ కసరత్తు సాగిస్తోంది. ఇక షిండే శిబిరంలో మంత్రిగా పనిచేస్తున్న శివసేన శంభురాజ్ దేశాయ్ మాట్లాడుతూ 2024 లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ 22 స్ధానాల్లో పోటీకి సై అంటోందని చెప్పారు. ఇక మాల్దా, రత్నగిరి, సింధుదుర్గ, మావల్, షిరూర్, రాయ్ఘఢ్, ముంబై నార్త్వెస్ట్, పాల్ఘర్, శంభాజీ నగర్, పర్బని, యావత్మాల్, షిర్డి, గడ్చిరోలి స్ధానాల కోసం బీజేపీ, శివసేన (ఏక్నాథ్ షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది.
Read More :
WPL 2024 | ‘మసాలా చాయ్’పై మనసుపడ్డ హిట్టర్.. రోజుకు అన్ని కప్పులా..?