శ్రీనగర్ : కార్గిల్ యుద్ధంలో అమరవీరులైన భారతదేశం సైనికులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివాళులర్పించారు. బారాముల్లా జిల్లాలోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద సోమవారం ఉదయం రామ్నాథ్ కోవింద్ పుష్ఫగుచ్ఛాలు ఉంచి నివాళుర్పించారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ఆదివారం జమ్ముకశ్మీర్ వచ్చారు.
తొలుత రాష్ట్రపతి కోవింద్.. లఢక్ ద్రాస్ సెక్టార్లో పర్యటించి కార్గిల్ అమరవీరులకు నివాళులర్పిస్తారని రాష్ట్రపతి భవన్తోపాటు సైన్యాధికారులు ముందు తెలిపారు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో బారాముల్లాలోని కార్గిల్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. కార్గిల్లోని ఎత్తైన కొండలను ఆక్రమించుకునేందుకు పాకిస్తాన్ చేసిన కుట్రలను తిప్పికొట్టడంలో దాదాపు 527 మంది భారతదేశం జవాన్లు అమరవీరులయ్యారు. వీరిని స్మరించుకుంటూ జాతియావత్తు ఇవాళ కార్గిల్ విజయ్ దివాస్ను జరుపుకుంటున్నది. నాలుగు రోజుల పర్యటనలో ఉన్న రాష్ట్రపతి కోవింద్.. ద్రాస్ సెక్టార్కు వెళ్లేందుకు సిద్ధమవగా, వాతావరణం అనుకూలించడం లేదంటూ సైన్యం ఆయన ప్రయాణానికి అనుమతించలేదు. దాంతో బారాముల్లాలోని కార్గిల్ అమరవీరుల స్థూపం వద్ద ఆయన పుష్ఫగుచ్ఛం ఉంచారు.
చరిత్రలో ఈ రోజు.. కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం
మొబైల్ వాడకంలో మనకు మూడో స్థానం
ఒత్తిడితో తెల్లటి జుట్టుకు ప్రత్యక్ష సంబంధం : తేల్చిన పరిశోధకులు
3 డీ ప్రింటింగ్తో కృత్రిమ చెవులు, ముక్కు సృష్టి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..