గౌహతి: అస్సాంలో ఖాజిరంగా పార్కు(Kaziranga Park)లో ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Murmu) జీపు సఫారీ చేశారు. రైనోలకు ఫేమస్ అయిన ఆ పార్కులో ఆమె ఇవాళ ఉదయం కాసేపు గడిపారు. మిహిముక్ పాయింట్ నుంచి ఆమె పార్క్లోకి ఎంటర్ అయ్యారు. ఆ అడవిలో ఉన్న ఖడ్గ మృగాలు, పక్షులు, జింకలు, వన్య ప్రాణుల్ని చూశారు. పార్క్లో ఉన్న ఏనుగులకు ఆమె ఫీడింగ్ చేశారు.
ఖాజిరంగా పార్కు స్కూల్లో రాష్ట్రపతి ముర్ము గజ ఉత్సవ్(Gaj Utsav)ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ గులాబ్ చాంద్ కటారియా, సీఎం హేమంత శర్మ పాల్గొంటున్నారు. ఇవాళ గౌహతిలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారు. మౌంట్ కాంచెనగంగా ఎక్స్పెడిషన్ను ప్రారంభిస్తారు. శనివారం రోజు తేజ్పూర్ ఎయిర్స్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఆమె సుఖోయ్ 30 ఎంకేఐ విమానంలో ఎగరనున్నారు.