రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో ముచ్చటించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముర్ము మెట్రో రైలులో ప్రయాణించడం ఇదే తొలిసారి.
అంతేగాక పదవిలో ఉండి మెట్రో రైలులో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగా నిలిచారు. గతంలో ప్రతిభా పాటిల్ తొలిసారి మెట్రోలో ప్రయాణించారు.