న్యూఢిల్లీ, జూన్ 4: త్రివిధ దళాలకు ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలను ప్రదానం చేశారు. రక్షణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రపతి భవన్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో 30 మంది అధికారులకు పరమ విశిష్ఠ సేవా మెడల్స్, ఐదుగురికి ఉత్తమ యుద్ధ సేవా మెడల్స్, 57 మందికి అతి విశిష్ఠ సేవా మెడల్స్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు.
పరమ విశిష్ఠ సేవా పతకం, నౌ సేనా మెడల్ పొందిన వారిలో ఆంధ్రప్రదేశ్లోని తెనాలికి చెందిన వైస్ అడ్మిరల్ శ్రీనివాస్ వెన్నం ఉన్నారు. 38 ఏండ్లుగా వివిధ హోదాల్లో నౌకాదళంలో సేవలందిస్తూ వైస్ అడ్మిరల్ స్థాయికి చేరుకున్నారు.