న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను ఎయిమ్స్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) నుంచి స్పెషల్ రూమ్కు తరలించారు. అయన ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతున్నదని ఎయిమ్స్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రత్యేక వైద్య బృందం రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నదని చెప్పారు. ఛాతిలో స్వల్పంగా నొప్పి రావడంతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గత నెల 29న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు మార్చి 30న బైసాస్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి బాగానే ఉన్నదని, అయితే కొద్దిరోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కాకి ని చూసి మనషులు సిగ్గు పడాలి.. వీడియో వైరల్
కొవిడ్ కొత్త మార్గదర్శకాలు జారీ
తమిళ నటి గౌరీ కిషన్ కు కరోనా పాజిటివ్
కరోనా విలయం.. 89వేలు దాటిన కేసులు