న్యూఢిల్లీ : మేఘాలయ, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల ప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలు సహజ సంపదను కలిగి ఉన్న రాష్ట్రాలు అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ మూడు రాష్ట్రాలు ఈశ్యాన్య ప్రాంతపు సంస్కృతి, విశిష్ట సంప్రదాయాలను సూచిస్తాయన్నారు.
మేఘాలయ, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాలు భారతదేశ అభివృద్ధికి తమ శక్తి మేర సహకారం అందిస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. 1972, జనవరి 21న మణిపూర్, మేఘాలయ, త్రిపుర ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి.